- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
జాతీయ అవార్డ్కు ఎంపికైన నిజాంపేట్ మేయర్..
by Satheesh |

X
దిశ, నిజాంపేట్: నిజాంపేట్ మేయర్ నీలా గోపాల్ రెడ్డిని క్వీన్ ఆఫ్ నేషన్ అవార్డు వరించింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు పురస్కరించుకొని విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ సంస్థ నిజాంపేట్ మేయర్కు ఈ అవార్డును ప్రధానం చేసింది. మున్సిపల్ కార్పొరేషన్ తొలి మేయర్గా బాధ్యతలు చేపట్టి నగర పాలక సంస్థ అభివృద్ధి కోసం శ్రమిస్తున్న నీలా గోపాల్ రెడ్డి జాతీయ స్థాయిలో స్వచ్ఛ నిజాంపేట్ ర్యాంకు సాధించడంతో పాటు.. స్థానికంగా ఉత్తమ సేవలు అందిస్తున్న నగర మహిళా మేయర్గా గుర్తించి క్వీన్ ఆఫ్ ది నేషన్ అవార్డుతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ సీఈఓ సత్యవోలు రాంబాబు, డైరెక్టర్ సత్యవోలు పూజిత, ఆంధ్రప్రదేశ్ అడ్వైసర్ సుందరపల్లి గోపాల్ కృష్ణ, సినీ హీరో సృజన్ తదితరులు పాల్గొన్నారు.
Next Story