కూతురి ఆసుపత్రి ఓపెనింగ్ విషయంలో రఘునందన్‌పై నెటిజన్స్ ఫైర్.. తీవ్ర వ్యతిరేకత

by Dishanational1 |
కూతురి ఆసుపత్రి ఓపెనింగ్ విషయంలో రఘునందన్‌పై నెటిజన్స్ ఫైర్.. తీవ్ర వ్యతిరేకత
X

దిశ ప్రతినిధి, సంగారెడ్డి: 'అగ్గిపెట్టె మంత్రి అని రోజూ ఎగతాళి చేస్తావు. ఆ అగ్గిపెట్టె మంత్రి వచ్చి అగ్గిపెట్టే వరకు నీ కూతురు దవాఖాన తలుపులు తెరుచుకోకపాయే. షర్టు కూడా మార్చకుండానే రాజకీయాలు మార్చడం నీకే సాధ్యమైంది. ఓ చోట బిడ్డ కోసం ఆరాటం, మరో చోట జనం చూడాలని పోరాటమా..?' అని బీజేపీ నేత, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్​పై నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. ఊహించని స్థాయిలో ఆయనపై తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. ఎమ్మెల్యే రఘునందన్​రావు కూతురు హైదరాబాద్​లోని అమీర్ పేటలో కొత్తగా ఆసుపత్రిని ప్రారంభించారు. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్​రావు, పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్​యాదవ్​లు ఈనెల 30న బుధవారం ఆసుపత్రిని ప్రారంభించారు. రఘునందన్​రావు దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని నడింపించారు. ఇదిలా ఉండగా మరుసటి రోజు గురువారం సిద్దిపేట జిల్లా తొగుట మండలం గుడికందులలో రైతు బజారును ఆయన ప్రారంబించారు. ఈ సందర్భంగా స్థానికులు, టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు రఘునందన్​ను అడ్డుకున్నారు. ఎన్నికల సమయంలో ఎన్నో హామీలు ఇచ్చారని.. వాటిని ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. పోలీసులు రంగప్రవేశం చేసి రఘునందన్​రావును పోలీస్ స్టేషన్ కు​తరలించారు. అయితే కావాలవే టీఆర్ఎస్​కార్యకర్తలు, స్థానికులు అడ్డుకుంటుంటే పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించారని


ఆగ్రహం వ్యక్తం చేస్తూ స్టేషన్​లోనే రఘునందన్ నిరసనకు దిగారు. పోలీసులపై, టీఆర్ఎస్​ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీవ్ర ఆరోపణలు చేశారు. ఇక అక్కడ మొదలైంది సోషల్ మీడియాలో రఘునందన్​పై విమర్శల దాడి. 'అగ్గిపెట్టె మంత్రి హరీష్​రావు అని నిత్యం ఆరోపిస్తావు. ఆయన లేనిది మీ కూతురు ఆసుపత్రి ఓపెన్​కాలేదా..? తలసానిని పిలుచుకున్నావ్​.. కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి ఎక్కడ.? హైదరాబాద్​బీజేపీ రాజాసింగ్​గుర్తుకు రాలేదా..? అని నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపించారు. కూతురు ఆసుపత్రి ఓపెనింగ్​రోజు వేసుకున్న షర్టే గురువారం కూడా ఉంది. షర్టులు మార్చకుండానే రాజకీయాలు మార్చుతావు.. హరీష్​రావు రాకపోతే ఆసుపత్రి తలుపులు తెరుచుకోకపోవునా..?' అంటూ ఎద్దేవా చేస్తున్నారు. గత ఎన్నికల్లో పరోక్షంగా మీ గెలుపునకు సహకరించారనే మంత్రులను పిలిచి ఆసుపత్రి ఓపెనింగ్​చేయించావా..? రఘునందన్​రావు అంటూ ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. ఓ చోట మోకరిల్లడం, మరో చోట జనం చూస్తున్నారని ఆరోపణలతో పోరాటమా..? అని విమర్శలు చేశారు. సాధ్యం కానీ హామీలు ఇచ్చి గద్దనెక్కి ఇప్పుడు జనం తిరగబడితే ఆ నెపం టీఆర్ఎస్ పై నెట్టడానికి రఘునందన్​రావు పడరాని పాట్లు పడుతున్నారంటూ టీఆర్ఎస్​కార్యకర్తలు కూడా సోషల్ మీడియాలో విమర్శల వర్షం కురిపిస్తున్నారు. కాగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కూడా ఆసుపత్రి ఓపెనింగ్ కు ఆహ్వానించారని ఆయన ఢిల్లీలో ఉండడంతో రాలేకపోయారని బీజేపీ శ్రేణులు కౌంటర్లు ఇస్తున్నారు.





Next Story

Most Viewed