నేపాల్ సాధారణ ఎన్నికలు.. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం

by Malleboina Mahesh |

నేపాల్ 2026 సాధారణ ఎన్నికల పోలింగ్ నేడు (మార్చి 5) ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. అధికారులు అన్ని కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి చేశారు.

నేపాల్ సాధారణ ఎన్నికలు.. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం
X

దిశ, వెబ్ డెస్క్: నేపాల్ దేశంలో 2026 సాధారణ ఎన్నికలకు పోలింగ్ ఈ రోజు ఉదయం ప్రారంభం అయింది. జెన్ జెడ్ ఉద్యమం (Gen Z movement) తర్వాత జరుగుతున్న ఈ ఎన్నికల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఖాట్మండులోని అన్నపూర్ణ వినాయక్ స్కూల్ పోలింగ్ సెంటర్‌తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల సిబ్బంది పోల్ ప్రిపరేషన్లను ముగించి, ఓటర్ల రాక కోసం ఎదురుచూస్తున్నారు. ఈ రోజు ఉదయం 7 గంటల నుంచి ఓటింగ్ ప్రక్రియ ప్రారంభం అయింది.

ప్రజాస్వామ్య పండుగలో పాల్గొనేందుకు ఓటర్లు ఉత్సాహం చూపిస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రభుత్వం భారీ భద్రత (Massive security) ఏర్పాట్లు చేసింది. ఈ ఎన్నికలు నేపాల్ భవిష్యత్తు (future of Nepal)ను నిర్ణయించడంలో అత్యంత కీలకం కానున్నాయి. ఇటీవల రాష్ట్రంలో జరిగిన భారీ నిరసనలు, జెన్ జెడ్ ఉద్యమం తర్వాత జరుగుతున్న ఎన్నికలు కావడంతో ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. అలాగే పోలింగ్ సందర్భంగా ఎటువంటి అల్లర్లు సంభవించకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.

Next Story