జోగులాంబ క్షేత్రంలో నగరి ఎమ్మెల్యే రోజా..

by Web Desk |
జోగులాంబ క్షేత్రంలో నగరి ఎమ్మెల్యే రోజా..
X

దిశ ,ఉండవెల్లి : తెలంగాణలోని ఏకైక శక్తి పీఠం అలంపూర్ జోగులాంబ, బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను శనివారం సినీ నటి, వైసీపీ ఎమ్మెల్యే రోజా దర్శించుకున్నారు. ఈ మేరకు ఆలయ అధికారులు ఆమెకు పూలమాలలు వేసి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆమె జోగులంబా అమ్మవారికి, స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీరి వెంట ఎస్ఐ శ్రీహరి, ఆలయ ప్రధాన అర్చకులు ఆనంద్ శర్మ, నాయకులు బెక్కం భాస్కర్ రెడ్డి, ఆలయ సిబ్బంది ఉన్నారు.

Next Story

Most Viewed