మై లై ఊచకోతకు 54 ఏళ్లు.. అసలేం జరిగింది?

by Javid Pasha |   ( Updated:2022-03-16 03:24:34.0  )
మై లై ఊచకోతకు 54 ఏళ్లు.. అసలేం జరిగింది?
X

దిశ, ఫీచర్: 1968లో ఇదే రోజున యూఎస్ సోల్జర్స్ దారుణానికి ఒడిగట్టారు. వియత్నాంతో వార్ నేపథ్యంలో ఆ దేశపు కంచు కోటగా పరిగణించబడే 'మై లై' గ్రామస్తులను ఊచకోత కోశారు. నిరాయుధలైన ప్రజలపైకి 105 మంది యూఎస్ సైనికులను ఉసిగొల్పిన లెఫ్టినెంట్ కాలే.. ఒక్కొక్కరిని వెతికిమరీ హత్య చేయాలని ఆదేశించాడు. ఈ క్రమంలో 500 మంది ప్రాణాలు కోల్పోయినట్లు చరిత్ర చెబుతోంది. అయితే ప్రాణాలతో ఉన్న మిగిలిన గ్రామస్తులను కాపాడుకునేందుకు హెలికాప్టర్ పైలట్ హ్యూ థాంప్సన్.. గన్నర్‌ రాన్ రైడెన్‌హోర్‌తో కలిసి వీరోచితంగా పోరాడాడు. వీరిద్దరి ధైర్య సాహసాలకు 1998లో సోల్జర్స్ మెడల్స్ లభించగా.. 1999లో ట్రెంట్ యాంగర్స్ 'ది ఫర్గాటెన్ హీరో ఆఫ్ మై లై : ది థాంప్సన్ స్టోరీ'ని రచించారు.



Next Story