మాజీ విశ్వసుందరితో ఐపీఎల్ మాజీ చైర్మెన్ డేటింగ్

by Dishanational1 |
మాజీ విశ్వసుందరితో ఐపీఎల్ మాజీ చైర్మెన్ డేటింగ్
X

న్యూఢిల్లీ: ఐపీఎల్ సృష్టికర్త, మాజీ చైర్మెన్ లలిత్ మోడీ సంచలన ప్రకటన చేశారు. ప్రముఖ నటి, మాజీ విశ్వసుందరి సుస్మితాసేన్‌తో నూతన అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ గురువారం ట్విట్టర్ ద్వారా ఫోటోలు షేర్ చేశారు. 'కుటుంబాలతో కలిసి తిరుగుతూ గ్లోబల్ టూర్ తర్వాత లండన్‌కు తిరిగి వచ్చాను. సుస్మితా సేన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇద్దరం కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నాం' అని ట్వీట్ చేశారు. అయితే పెళ్లి చేసుకోవట్లేదని, డేటింగ్‌లో ఉన్నామని పేర్కొన్నారు. ఐపీఎల్‌లో అవతవకలకు పాల్పడ్డాడని మనీ లాండరింగ్ కేసు నమోదు కావడంతో భారత్ విడిచి, 2010 నుంచి లండన్‌లో ఉంటున్నారు. మరోవైపు 1994 విశ్వసుందరిగా నిలిచిన సుస్మితా సేన్, బాలీవుడ్‌లో పలు చిత్రాల్లో నటించారు. ఈమెకు ఇద్దరు కూమార్తెలు అలిసా, రెనీ. అంతకుముందు తనకన్నా చిన్నవాడితో రిలేషన్‌షిప్ నడిపి వార్తల్లో నిలిచింది.

Next Story

Most Viewed