- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
'మీ అంతు చూస్తా..' అన్నందుకు హత్య..
దిశ, మక్తల్: మక్తల్ నియోజకవర్గంలోని కృష్ణ మండలంలో మంగళవారం రాత్రి మునాఫ్ ను హత్య చేసి పరారైన యశ్వంత్ చౌదరి, దేవరాజులు హత్యకు ఉపయోగించిన మారణాయుధాలను, రక్తం బట్టలను తీసుకుని ఎక్కడికైనా పారిపోదాం అనుకున్నారు. అందుకుగాను కృష్ణ హిందుపూరు బ్రిడ్జి కింద దాచి ఉంచిన వాటిని తీసుకోవడానికి వస్తున్నారన్న సమాచారం మేరకు తమ సిబ్బందితో దాడిచేసి నిందితులను అరెస్టు చేశామని సీఐ సీతయ్య గురువారం మధ్యాహ్నం విలేకరుల సమావేశంలో తెలిపారు.
హత్య చేయడానికి కారణాలపై నిందితులను విచారించగా తల్లికి ఓల్డేజి పెన్షన్ రాకుండా చేశాడని దేవరాజ్(24) తన చికెన్ దుకాణానికి పోటీగా మరో వ్యక్తితో పోటిగా పెట్టించినందుకు యశ్వంత్ చౌదరి(20) మునాఫ్ ను అడిగినందుకు 'మీరు నన్ను ప్రశ్నిస్తారా.. మీ అంతు చూస్తా.. మిమ్మల్ని చంపేస్తా..' అని బేదిరించినందుకు భయపడి హత్య చేశారు.
కర్ణాటకలోని మైలాపురం జాతరలో మారణాయుధాలను ఖరీదు చేశామని, పథకం ప్రకారం ఇద్దరం కలిసి మంగళవారం రాత్రి మునాఫ్ ను హత్య చేసినట్లు నేరాని అంగీకరించారని మక్తల్ సీఐ సీతయ్య, కృష్ణ ఎస్ఐ విజయ బాస్కర్ చెప్పారు. నేరం అంగీకరించడంతో చట్ట ప్రకారం వారిని నారాయణపేట జిల్లా జడ్జి ముందు హాజరు పరుస్తున్నామన్నారు.