డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని మంత్రికి వినతి..

by Kodari Anjali |   (  Updated:2026-06-20 10:15:35  IST  )

కిడ్ని డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని మంత్రి దామోదర్ రాజ నర్సింహను మానవ హక్కుల కమిటీ జిల్లా ఛైర్మన్ కోరారు.

డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని మంత్రికి వినతి..
X

దిశ, ఆసిఫాబాద్: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలంలోని కిడ్ని డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర వైద్య. ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ నర్సింహను మానవ హక్కుల కమిటీ జిల్లా ఛైర్మన్ రాథోడ్ రమేష్ కోరారు. శనివారం హైదరాబాద్ లోని మంత్రి అధికారిక నివాసంలో కలిసి ఈ మేరకు వినతి పత్రం అందజేశారు. అలాగే జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిల్లో ఖాళీ ఉన్న హెల్త్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయాలని కోరారు. ఈ విషయంలో మంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఆయన చెప్పారు.

Next Story