'కేసీఆర్ మాటలు నమ్మకండి..రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే'

by Dishanational2 |
కేసీఆర్ మాటలు నమ్మకండి..రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే
X

దిశ ,చిన్నశంకరంపేట : కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపడుతున్న సర్వోదయ సంకల్ప యాత్రలో భాగంగా శనివారం చిన్న శంకరంపేట ఎంపీపీ ఆవుల భాగ్యలక్ష్మి గోపాల్ రెడ్డి పాల్గొన్నారు. మెదక్ జిల్లా కాళకళ్ నుంచి కొనసాగుతున్న పాదయాత్రను టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ప్రారంభించారు. సంకల్ప యాత్రలో భాగంగా చిన్న శంకరం పేట ఎంపీపీ ఆవుల భాగ్యలక్ష్మి గోపాల్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కొత్త నాటకాలు ఆడుతూ కొత్త కొత్త పథకాలు పెడుతూ ఓట్ల కోసం జిమ్మిక్ ఆడుతున్నట్లు ఆమె తెలిపారు. డబల్ బెడ్ రూమ్ ఏ గ్రామాల్లో నిర్వహించలేదని ఇచ్చినప్పటికీ పది పైసల పాటు నిర్వహించే నేటికీ లబ్ధిదారులకు డబల్ బెడ్ రూమ్ అందించలేదని తెలిపారు. రుణమాఫీ పూర్తి చేస్తానని చెప్పి నేటికీ పూర్తి చేయకపోవడంతో రైతులు నష్టపోతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్ ఎస్ యూ ఐ మాజీ జాతీయ అధ్యక్షులు మాజీ పార్లమెంట్ సభ్యులు సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తూముకుంట నర్సారెడ్డి కాంగ్రెస్ నాయకులు నార్సింగ్ మండలం అధ్యక్షుడు గోవర్ధన్ ఆయా మండలాల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.



Next Story