బేటీ బచావ్‌-బేటీ పడావో నిధుల దుర్వినియోగం.. వివరణ కోరిన వైసీపీ ఎంపీ

by Disha Web |
బేటీ బచావ్‌-బేటీ పడావో నిధుల దుర్వినియోగం.. వివరణ కోరిన వైసీపీ ఎంపీ
X

దిశ, ఏపీ బ్యూరో : బేటీ బచావ్‌-బేటీ పడావో పథకం ప్రచారం కోసం 2016-2019 మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన రూ.447 కోట్లలలో 79 శాతం నిధులు కేవలం మీడియా ప్రచారానికే వినియోగించినట్లుగా మహిళా సాధికారతపై ఏర్పాటైన పార్లమెంటరీ స్థాయీ సంఘం నివేదిక పేర్కొంది. అంటే నిధుల వినియోగానికి సంబంధించిన నిర్దేశించిన విధివిధానాలను ఉల్లంఘించేలా ఈ పథకైం మీడియా ప్రచారం కోసం అడ్డగోలుగా ఖర్చు చేయడానికి కారణాలు ఏమిటో వివరణ ఇవ్వాలని బుధవారం రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీని ప్రశ్నించారు.

Next Story