పండగ పూట తీవ్ర విషాదం.. పిల్లలతో సహా చెరువులో దూకిన తల్లి

by Disha Web Desk 2 |
పండగ పూట తీవ్ర విషాదం.. పిల్లలతో సహా చెరువులో దూకిన తల్లి
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: హోలీ పర్వదినాన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలో ఇద్దరు చిన్నారులతో సహా తల్లి చెరువులో దూకగా, కరీంనగర్ జిల్లా రామడుగు మండలం దేశరాజ్ పల్లిలో ఈతకు వెల్లి 14 ఏళ్ల బాలుడు గల్లంతయ్యాడు.

కుటుంబ కలహాలతో...

రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం కొత్తపల్లి గ్రామ చెరువులో శుక్రవారం తెల్లవారు జామున ఇద్దరి చిన్నారులతో సహా తల్లి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనలో చిన్నారులు అభిజ్ఞ (3), హన్సిక(6 నెలలు) మృతదేహాలు నీటిలో తేలాయి. తల్లి రేఖ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రేఖ ఆచూకీ కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. అయితే రేఖ తన పిల్లలతో సహా ఆత్మహత్యకు పాల్పడడానికి కారణం కుటుంబ కలహాలేనని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. పూర్తి వివరాలు సేకరించే పనిలో పోలీసులు నిమగ్నం అయ్యారు.

రామడుగు మండలంలో...

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం దేశరాజ్ పల్లి గ్రామంలోని ఊర చెరువులో సాయి చరణ్ (14) అనే బాలుడు మృత్యువాత పడ్డాడు. గురువారం ఉదయం తన స్నేహితులతో కలిసి ఊర చెరువులో ఈతకు వెల్లగా ప్రమాదవశాత్తు సాయి చరణ్ చెరువులో మునిగిపోయాడు. గమనించిన మిత్రులు సాయి చరణ్ కోసం గాలించగా ఫలితం లేకుండా పోయింది. శుక్రవారం ఉదయం శవమై తేలాడు. రామడుగు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.



Next Story

Most Viewed