యూఏఈపై దాడులను సహించం.. ప్రధాని మోడీ తీవ్ర ఆగ్రహం!

by Malleboina Mahesh |

యూఏఈపై జరిగిన దాడుల్లో ముగ్గురు భారతీయులు గాయపడటాన్ని ప్రధాని మోదీ తీవ్రంగా ఖండించారు. దౌత్యం ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని కోరుతూ యూఏఈకి సంఘీభావం తెలిపారు.

యూఏఈపై దాడులను సహించం.. ప్రధాని మోడీ తీవ్ర ఆగ్రహం!
X

దిశ, వెబ్ డెస్క్: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ (Narendra Modi) యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)పై జరిగిన దాడులను తీవ్రంగా ఖండించారు. ఈ దాడుల్లో ముగ్గురు భారతీయ పౌరులు గాయపడటం పట్ల ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే పౌరులు, మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకోవడం ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశారు. ఈ క్లిష్ట సమయంలో భారత్ పక్షాన యూఏఈకి పూర్తి సంఘీభావం తెలుపుతున్నట్లు పేర్కొన్న ప్రధాని, అన్ని సమస్యలను చర్చలు, దౌత్య మార్గాల ద్వారా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని పునరుద్ఘాటించారు.

ప్రాంతీయ శాంతి, గ్లోబల్ ఎనర్జీ సెక్యూరిటీని దృష్టిలో ఉంచుకుని ప్రధాని కీలక వ్యాఖ్యలు చేశారు. హార్ముజ్ జలసంధి (Strait of Hormuz) ద్వారా సురక్షితమైన, నిరంతరాయమైన నౌకాయానాన్ని నిర్ధారించడం అంతర్జాతీయ ఇంధన భద్రతకు, ప్రాంతీయ స్థిరత్వానికి అత్యంత కీలకమని ఆయన ట్వీట్ చేశారు. భారత పౌరుల భద్రతకు ప్రాధాన్యతనిస్తూనే, మధ్యప్రాచ్యంలో శాంతి నెలకొనడానికి భారత్ తన మద్దతును ఎల్లప్పుడూ కొనసాగిస్తుందని మోడీ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

Next Story