- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
బీజేపీ నాయకులు తెలంగాణ బిడ్డలేనా..? ఎమ్మెల్సీ కవిత

X
దిశ ప్రతినిధి, నిజామాబాద్: వరి ధాన్యం కొనుగోలు అంశంపై రాష్ట్ర బీజేపీ నాయకుల వైఖరి చూస్తుంటే వీళ్ళు అసలు తెలంగాణ బిడ్డలేనా అని అనిపిస్తుందని ఎమ్మెల్సీ కవిత ఫైర్ అయ్యారు. మంగళవారం వరి ధాన్యం కొనుగోలు అంశంలో బీజేపీ నేతల కామెంట్స్పై ఎమ్మెల్సీ కవిత ట్విట్టర్ వేదికగా నిప్పులు చెరిగారు. ధాన్యం సేకరణలో దేశమంతటికీ ఒకే విధానం ఉండాలని కేసీఅర్ రైతుల పక్షాన స్పష్టంగా డిమాండ్ చేశారని తెలిపారు. పంజాబ్, హరియాణా రాష్ట్రాలకు ఒక నీతి, ఇతర రాష్ట్రాలకు మరో నీతి ఉండకూడదని.. కేంద్రం పంజాబ్లో వడ్లు 100% కొనుగోలు చేసినట్టే, తెలంగాణలోనూ కొనుగోలు చేయాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోలుపై వన్ నేషన్ వన్ ప్రొక్యూర్మెంట్ ఉండాలని కవిత అన్నారు.
Next Story