పేదలకు సేవ చేయడంలో ప్రతి ఒక్కరు ముందుకు రావాలి: ఎమ్మెల్యే ముఠా గోపాల్

by Disha Web Desk 12 |
పేదలకు సేవ చేయడంలో ప్రతి ఒక్కరు ముందుకు రావాలి: ఎమ్మెల్యే ముఠా గోపాల్
X

దిశ, ముషీరాబాద్: పేదలకు సేవ చేయడంలో ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ఎమ్మెల్సి కల్వకుంట్ల కవిత జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం వెయ్యి మంది పేదలకు అల్పాహారం పంపిణీ కార్యక్రమం టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కందూరి కృష్ణ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ముఠా గోపాల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కందూరి కృష్ణ పేదలను ఆదుకోవడం గొప్ప విషయమన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ యువ నేత ముఠా జయసింహ, గోవిందరావు, సుధాకర్ గుప్త, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు ఆర్ మోజెస్, నేతలు వీ నాగభూషణం, శివ కుమార్ యాదవ్, ముచ్చ కుర్తి ప్రభాకర్, జనార్దన్, మల్లేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed