మరిన్ని నిధులు మంజూరు చేయండి.. కేటీఆర్‌ను కోరిన సైదిరెడ్డి

by Disha Web Desk 2 |
మరిన్ని నిధులు మంజూరు చేయండి.. కేటీఆర్‌ను కోరిన సైదిరెడ్డి
X

దిశ, నేరేడుచర్ల: హుజూర్‌నగర్ నియోజకవర్గం అభివృద్ధికి మరికొన్ని నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి సోమవారం మంత్రి కేటీఆర్‌ను కోరారు. హైదరాబాద్‌లోని మంత్రి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి కోరారు. దీనికి మంత్రి కేటీఆర్ కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. అలాగే, మేళ్లచెరువు మండల కేంద్రంలోని శంభులింగేశ్వరస్వామి దేవాలయంలో మహా శివరాత్రి సందర్భంగా నిర్వహించిన ఎడ్లపందాలు, కబడ్డీ పోటీల వీడియోలు, ఫొటోలు కేటీఆర్‌కు చూపించారు.

Next Story

Most Viewed