రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

by Batti.Sumithra |

జాతీయ రహదారి 65 తాడ్వాయి నుంచి నేలమర్రి వరకు పది కిలోమీటర్ల మేర ఉన్న సింగిల్ రోడ్డును రూ.24 కోట్ల వ్యయంతో నిర్మించే రోడ్డు డబుల్ రోడ్డు పనులకు కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి శనివారం శంకుస్థాపన చేశారు.

రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే
X

దిశ, మునగాల : జాతీయ రహదారి 65 తాడ్వాయి నుంచి నేలమర్రి వరకు పది కిలోమీటర్ల మేర ఉన్న సింగిల్ రోడ్డును రూ.24 కోట్ల వ్యయంతో నిర్మించే రోడ్డు డబుల్ రోడ్డు పనులకు కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో పీసీసీ డెలికేట్ లక్ష్మి నారాయణ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు కాసర్ల కోటేశ్వరరావు, నాయకులు నల్లపాటి శ్రీనివాస్ రావు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు కొలిశెట్టి బుచ్చి పాపయ్య, గ్రామ సర్పంచ్ కొలిశెట్టి రామయమ్మ, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మాతంగి బసవయ్య, మండల కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వేనేపల్లి వీరబాబు, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సాయి తదితరులు పాల్గొన్నారు.

Next Story