ఆ జాతరకు బస్సులో వెళ్లడం సురక్షితం: ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య

by Web Desk |
ఆ జాతరకు బస్సులో వెళ్లడం సురక్షితం: ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య
X

దిశ, బెల్లంపల్లి: మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు బెల్లంపల్లి బస్ స్టాండ్ నుండి ఏర్పాటు చేసిన ప్రత్యేక RTC బస్ సర్వీస్ లను ఆదివారం ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మేడారం జాతరకు భక్తులు బస్సులో వెళ్లడం సురక్షితమన్నారు. భక్తులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో RTC ఆసిఫాబాద్ డిపో డిఎం సుగుణాకర్, బెల్లంపల్లి మున్సిపల్ చైర్మన్ శ్వేత శ్రీధర్, వైస్ చైర్మన్ సుదర్శన్, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed