- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
నా కృషి ఫలించింది.. ఆనందం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే చిరుమర్తి
దిశ, నకిరేకల్: నకిరేకల్ మున్సిపాలిటీని మోడల్ మున్సిపాలిటీగా చేయాలనుకున్న నా కృషి ఫలించిందని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆనందం వ్యక్తం చేశారు. నకిరేకల్ పట్టణంలో సెంట్రల్ లైటింగ్, డివైడర్ నిర్మాణాలకు రూ. 26 కోట్లు, కాలం వారి కుంట మినీ ట్యాంక్ బండ్ కు రూ. 50 లక్షలు, ఎస్సీల వైకుంఠధామం నిర్మాణానికి రూ. 50 లక్షలు, క్రిస్టియన్ వైకుంఠధామం నిర్మాణానికి రూ. 50 లక్షల రూపాయలు, మొత్తంగా27.75 కోట్ల రూపాయల నిధుల జీవో కాపీ ని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య శనివారం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అహర్నిశలు నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధికి సహకరిస్తున్న సీఎం కేసీఆర్ కు, జిల్లా మంత్రివర్యులు జగదీష్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే రోజుల్లో నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.