శిథిలావస్థలో మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్

by Jakkula.Mamatha |

నారాయణపేట జిల్లా మద్దూరు పట్టణ కేంద్రంలో అమరగడ్డ మూడో వార్డులో ఉన్న మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ సుమారుగా నిర్మించి 40 సంవత్సరాలు పూర్తి కావడంతో శిథిలావస్థకు చేరింది.

శిథిలావస్థలో మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్
X

దిశ, మద్దూరు: నారాయణపేట జిల్లా మద్దూరు పట్టణ కేంద్రంలో అమరగడ్డ మూడో వార్డులో ఉన్న మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ సుమారుగా నిర్మించి 40 సంవత్సరాలు పూర్తి కావడంతో శిథిలావస్థకు చేరింది. గురువారం రాత్రి 12 గంటల సమయంలో ఒక్కసారిగా ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ పైకప్పు కూలి ఒక్కసారిగా పెద్ద శబ్దం రావడంతో చుట్టుపక్కల ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. శిథిలావస్థకు చేరిన వాటర్ ట్యాంక్ వల్ల చుట్టుపక్కల నివసించే స్థానికులు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బతుకుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. శిథిలావస్థకు చేరిన వాటర్ ట్యాంకును వెంటనే కూల్చివేసి కొత్తగా వాటర్ ట్యాంక్ నిర్మించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Next Story