Mirchi Price: మిర్చి అ'ధర'హో.. బంగారం రేటును మించిన మిర్చి

by Disha Web Desk 12 |
Mirchi Price: మిర్చి అధరహో.. బంగారం రేటును మించిన మిర్చి
X

దిశ, వరంగల్ టౌన్ : ఎండు మిర్చి అ'ధర' గొడుతుంది. బంగారం రేటును తలదన్నేలా వరంగల్ మార్కెట్ లో మిర్చి రేటు మార్కెట్ చరిత్ర తిరగరాస్తుంది. మూడు రోజుల సెలవుల తర్వాత సోమవారం మార్కెట్ ప్రారంభం అయ్యింది. మార్కెట్ కు వివిధ రకాల సరుకులు పెద్ద ఎత్తున పోటేత్తయ్యాయి. మిర్చి కూడా భారీగానే తరలివచ్చింది. ఈ దశలో మిర్చి సింగిల్ పట్టి ధర భారీగా పలికింది. వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం గోవిందపురం రైతు పేరాల కిషన్ రావు అత్యధిక ధర పొందారు. కాకతీయ ట్రేడర్స్ ఆధ్వర్యంలో శాంభవి ట్రేడర్స్ ఖరీదు దారు క్వింటా మిర్చిని రూ.55,551తో కొనుగోలు చేశారు. ఈ సీజన్ లోనే కాదు మార్కెట్ చరిత్రలోనే ఇంత ధర పలకడం ఇదే తొలిసారి. అంతేకాదు, ఈ ధర బంగారం రేటును మించడం మరో చరిత్ర గా చర్చ సాగుతోంది.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed