అమ్మా.. దండం పెడతా.. ఓర్చుకో..

by Dishanational2 |
అమ్మా.. దండం పెడతా.. ఓర్చుకో..
X

దిశ, జవహర్ నగర్: సరదాగా ఈత కోసం వెళ్లి చెరువులో మునిగిపోయి ముగ్గురు విద్యార్థులు మృతి చెందిన ఘటన కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ని కలచివేసింది. కార్పొరేషన్ పరిధిలోని గబ్బిలాల పేటలో మేయర్ కావ్య, డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్, కార్పొరేటర్లతో కలిసి మంత్రి మల్లారెడ్డి బాధిత కుటుంబాలను పరామర్శించి వారికి భరోసా కల్పించారు. మృతి చెందిన బాధిత కుటుంబాలు విలవిలలాడుతూ బోరున తమ బాధను వెళ్లబుచ్చారు. దీంతో చలించిపోయిన మంత్రి విద్యార్థుల కుటుంబాలను ఓదార్చే ప్రయత్నం చేశారు. అమ్మ ఏడవకు నీ బాధ నాకు తెలుసు ఓర్చుకో తల్లీ.. అంటూ పలువురు నేతలు ఓదార్పునిచ్చారు. అనంతరం రూ. 25 వేల చొప్పున ఒక్కొక బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం చేస్తూ మంత్రి భరోసా కల్పించారు.

Next Story

Most Viewed