- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
చంద్రబాబు లాంటి నాయకుడు ఎక్కడ ఉండరేమోనంటూ మంత్రి కీలక వ్యాఖ్యలు

దిశ, ఏపీ బ్యూరో : రాష్ట్ర అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల తీరుపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ సభ్యులు సభలో గందరగోళం సృష్టిస్తున్నారని, సభ ఔన్నత్యాన్ని కాపాడాలని హితవు పలికారు. అసెంబ్లీలో అనేక అంశాలపై చర్చించాలని ఇకనైనా టీడీపీ సభ్యులు సభలో హుందాగా వ్యవహరించాలని కోరారు.ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబుపై సెటైర్లు వేశారు.
చంద్రబాబు సభను అకారణంగా బాయ్కాట్ చేసి ఎక్కడో కూర్చొని సభలో రాజకీయాలు చేస్తున్నారంటూ మంత్రి కన్నబాబు ఆరోపించారు.చంద్రబాబు లాంటి దిగజారుడు రాజకీయాలు చేసే నాయకుడు ఈ దేశంలో ఎవరూ ఉండరేమోనంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ సభ్యులు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని.. సభా సమయాన్ని అడ్డుకుంటున్నారంటూ మండిపడ్డారు. ఈ సందర్భంగా స్పీకర్ తమ్మినేని సీతారాంకు మంత్రి కన్నబాబు పలు సూచనలు చేశారు. ఎథిక్స్ కమిటీలో కీలక నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. టీడీపీ సభ్యులను కంట్రోల్ చేయకపోతే సభ ఔన్నత్యం దెబ్బతింటుందని మంత్రి కన్నబాబు సూచించారు. సభలో సభ్యుల ప్రవర్తన, నిబంధనావళిని సమీక్షించాలని స్పీకర్ తమ్మినేని సీతారాంకు విజ్ఞప్తి చేశారు.