'ఎన్టీఆర్‌ను చంపి తెలుగు దేశం పార్టీని లాక్కున్నారు'

by Disha Web Desk 2 |
ఎన్టీఆర్‌ను చంపి తెలుగు దేశం పార్టీని లాక్కున్నారు
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి తెలుగు దేశం పార్టీని లాక్కున్నారని అన్నారు. ఎన్టీఆర్ కుటుంబాన్ని చంద్రబాబు, నారా లోకేష్ కలిసి నాశనం చేశారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మళ్లీ ఎన్టీఆర్ బొమ్మతో రాష్ట్ర ప్రజలను మోసం చేయడానికి తండ్రీకొడుకులు పూనుకున్నారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ చిత్తుగా ఓడిపోతుందని జోస్యం చెప్పారు. ఎన్టీఆర్‌‌ను చెప్పులతో కొట్టించిన ఘనత చంద్రబాబుది అని, ఎన్టీఆర్‌ను చంపి ఆయన పేరుపై పండుగ చేసుకుంటున్నారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ పేరెత్తే అర్హత ప్రస్తుత టీడీపీ నేతల్లో ఎవరికీ లేదని స్పష్టం చేశారు.


Next Story

Most Viewed