విద్యుత్ షాక్‌తో పాడి ఆవు మృతి

by Ratna Kumari |

గుడిపల్లి మండల కేంద్రంలో బుధవారం రాత్రి విద్యుత్ తీగ తెగిపడి పాడి ఆవు విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది.

విద్యుత్ షాక్‌తో పాడి ఆవు మృతి
X

దిశ, పెద్ద అడిశర్లపల్లి (గుడిపల్లి) : గుడిపల్లి మండల కేంద్రంలో బుధవారం రాత్రి విద్యుత్ తీగ తెగిపడి పాడి ఆవు విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రైతు సామనూరి నరసరాజు తన పాడి పశువులను మేపుకుని ఇంటికి తీసుకొస్తుండగా, ఈదురుగాలుల కారణంగా తెగిపడి నేలపై పడిన విద్యుత్ తీగపై ఒక పాడి ఆవు కాలుపెట్టడంతో తీవ్ర విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనతో రైతు తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. సుమారు రూ.80 వేల విలువైన పాడి ఆవును కోల్పోయానని వాపోయాడు. తనకు జరిగిన నష్టాన్ని ప్రభుత్వం, సంబంధిత అధికారులు గుర్తించి తగిన ఆర్థిక సహాయం అందించాలని విజ్ఞప్తి చేశాడు. గ్రామస్థులు కూడా విద్యుత్ శాఖ అధికారులు తెగిపడిన విద్యుత్ తీగలను వెంటనే తొలగించి, ఇటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.

Next Story