మేఘాలయ బొగ్గు గని పేలుడు.. 30 కి చేరిన మృతుల సంఖ్య

by Malleboina Mahesh |   (  Updated:2026-02-10 06:38:48  IST  )

ఈ నెల 5న మేఘాలయలోని ఈస్ట్ జైంతియా హిల్స్ జిల్లాలోని బొగ్గు గనిలో పేలుడు సంభవించిన విషయం తెలిసిందే.

మేఘాలయ బొగ్గు గని పేలుడు.. 30 కి చేరిన మృతుల సంఖ్య
X

దిశ, వెబ్ డెస్క్: ఈ నెల 5న మేఘాలయలోని ఈస్ట్ జైంతియా హిల్స్ (East Jaintia Hills) జిల్లాలోని బొగ్గు గనిలో పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. ఈ ఘటన తర్వాత నేటికి రెస్క్యూ ఆపరేషన్ (Rescue operation) కొనసాగుతుండగా.. మృతుల సంఖ్య మంగళవారం నాటికి 30 కి చేరుకుంది. ఈ భారీ పేలుడులో తీవ్రంగా గాయపడి అస్సాంలోని సిల్చార్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ (SMCH)లో చికిత్స పొందుతున్న మరో ఇద్దరు బాధితులు సోమవారం రాత్రి కన్నుమూయడంతో ఈ మరణాల సంఖ్య పెరిగింది. మృతులను అస్సాంలోని కాచార్ జిల్లా కటిగోరా నివాసితులు రామచంద్ర వైష్ణవ్, నిమారుద్దీన్‌లుగా అధికారులు గుర్తించారు.

ఈ ఘోర ప్రమాదం జరిగినప్పటి నుండి సహాయక చర్యలు కొనసాగుతుండగా, గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. గని లోపల జరిగిన పేలుడు ధాటికి కార్మికులు తీవ్రంగా గాయపడ్డారని, వారిని మెరుగైన చికిత్స కోసం పొరుగు రాష్ట్రమైన అస్సాంలోని సిల్చార్‌కు తరలించినట్లు ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. ఇప్పటికే 28 మంది ప్రాణాలు కోల్పోగా, తాజా మరణాలతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

మేఘాలయలో అక్రమంగా నిర్వహిస్తున్న బొగ్గు గనుల (Rat-hole mining) భద్రతపై ఈ ఘటన మరోసారి ప్రశ్నలను లేవనెత్తింది. నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న ఈ తవ్వకాల్లో సరైన భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ఇలాంటి ఘోర ప్రమాదాలు జరుగుతున్నాయని పౌర హక్కుల సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వం ఈ ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించగా, బాధిత కుటుంబాలు తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.

మృత్యుధారగా మారిన మధ్యధరా సముద్రం.. 53 మంది వలసదారులు జలసమాధి

Next Story