NV Ramana: మీడియా ప్రజాస్వామ్యాన్ని వెనక్కి తీసుకెళ్తుంది

by Disha Web Desk |
Media is Running Kangaroo Court, Says CJI NV Ramana
X

రాంచీ: Media is Running Kangaroo Court, Says CJI NV Ramana| భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీవీ చర్చలు, సామాజిక మాధ్యమాల్లో కంగారూ కోర్టులు దేశాన్ని వెనక్కి తీసుకెళ్తున్నాయని అన్నారు. వారి ప్రవర్తన పక్షపాతం, అవగాహన లేని, ఎజెండా-ఆధారితమైనదని అన్నారు. శనివారం జార్ఖండ్ రాంచీలోని నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ స్టడీ అండ్ రీసెర్చ్ ఇన్ లాలో 'లైఫ్ ఆఫ్ ఎ జడ్జి' 'జస్టిస్ ఎస్‌బి సిన్హా మెమోరియల్ లెక్చర్' ప్రారంభ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. 'న్యాయమూర్తులకు వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో ఏకీకృత ప్రచారాలు జరుగుతున్నాయి.

న్యాయమూర్తులు వెంటనే స్పందించకపోవచ్చు. అయితే దీనిని బలహీనత లేదా నిస్సహాయతగా తప్పుపట్టవద్దు' అని అన్నారు. కొత్త మీడియా సాధనాలు అపారమైన విస్తరణ సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని చెప్పారు. తప్పులు, మంచి, చెడుతో పాటు నిజ, నకిలీల మధ్య తేడాను గుర్తించలేవని చెప్పారు. కేసుల నిర్ణయంలో మీడియా ట్రయల్స్ మార్గదర్శక కారకంగా ఉండవని తెలిపారు. మీడియా కంగారుగా కోర్టులను నడుపుతున్నట్లు తాము చూస్తున్నామని, కొన్నిసార్లు అనుభవజ్ఞులైన న్యాయమూర్తులు కూడా సమస్యలపై నిర్ణయం తీసుకోవడం కష్టమని ఆయన అన్నారు. న్యాయం పంపిణీకి సంబంధించిన సమస్యలపై అవగాహన లేని, ఎజెండాతో నడిచే చర్చలు ప్రజాస్వామ్య ఆరోగ్యానికి హానికరం అని రుజువు చేస్తున్నాయని తెలిపారు. మీడియా పక్షపాతంతో చేసే వ్యాప్తి ప్రజాస్వామ్యాన్ని బలహీనం చేయడమే కాకుండా, వ్యవస్థకు హనికరమని చెప్పారు. ఈ ప్రక్రియలో తీర్పులపై తీవ్రంగా ప్రభావం పడుతుందని అన్నారు. మీ బాధ్యతను అతిక్రమించి, ఉల్లంఘించడం ద్వారా మీరు మన ప్రజాస్వామ్యాన్ని రెండడుగులు వెనక్కి తీసుకెళ్తున్నారని మీడియాను ఉద్దేశించి జస్టిస్ రమణ అన్నారు.

న్యాయమూర్తులకు రక్షణ లేదు

రాజకీయ నాయకులు, బ్యూరోక్రాట్లు, పోలీసు అధికారులు, ఇతర ప్రజాప్రతినిధులకు వారి ఉద్యోగాల సున్నితత్వం కారణంగా పదవీ విరమణ తర్వాత కూడా తరచుగా భద్రత కల్పిస్తారు. హాస్యాస్పదంగా, న్యాయమూర్తులకు ఇలాంటి రక్షణ కల్పించరని అన్నారు. న్యాయ సమీక్ష లేనట్లయితే, మన రాజ్యాంగంపై ప్రజలకు విశ్వాసం తగ్గిపోయేదని చెప్పారు. రాజ్యాంగం అంతిమంగా ప్రజల కోసమని, న్యాయవ్యవస్థ రాజ్యాంగానికి ప్రాణం పోసే అవయమని తెలిపారు. కొన్ని దశాబ్దాల క్రితం వరకు, న్యాయమూర్తి నుండి అంచనాలు న్యాయస్థానాల ముందు పార్టీల మధ్య వివాద పరిష్కారానికి మాత్రమే పరిమితం అయ్యాయని తెలిపారు.

అయితే ఇప్పుడు, సమాజంలో ఆలోచించదగిన ప్రతి సమస్య న్యాయవ్యవస్థ ద్వారా పరిష్కరించబడుతుందని భావిస్తున్నారని పేర్కొన్నారు. మరోవైపు న్యాయమూర్తులు ఉదయం 10 నుండి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే పని చేస్తూ, సెలవులను ఆస్వాదిస్తారనే అపోహ ప్రజల మనస్సుల్లో ఉందని చెప్పారు. అలాంటి కథనం అవాస్తవమని అన్నారు. తీర్పులు ఇవ్వడానికి నిద్రలేని రాత్రులు గడపుతారని తెలిపారు. వ్యవస్థను తప్పించుకోదగిన సంఘర్షణలు మరియు భారాల నుండి రక్షించడానికి న్యాయమూర్తి ముఖ్యమైన విషయాలకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. న్యాయమూర్తిగా ఉండటం సులభమైన బాధ్యత కాదని, రోజులు గడుస్తున్న కొద్ది సవాళ్లను పెంచుతుందని చెప్పారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో జడ్జిలకు వ్యతిరేకత కల్పించే ప్రచారం ఎక్కువగా ఉందని అన్నారు.

ఇది కూడా చదవండి: ఐదంతస్థుల కిటికీలోంచి జారిపడిన చిన్నారి.. క్యాచ్ పట్టిన రియల్ హీరో (వీడియో)

Next Story

Most Viewed