- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
మేడారం హుండీ లెక్కింపు పూర్తి.. ఆదాయం ఎంత వచ్చిందంటే..?
by Nagaya |

X
దిశ, డైనమిక్ బ్యూరో : ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం హుండీ లెక్కింపు పూర్తయ్యింది. గత రెండు వారాలుగా హుండీలలోని నోట్లు, చిల్లర, బంగారం, వెండీ ఇతర వస్తువుల లెక్కింపు జరుగుతుండగా.. సోమవారం పూర్తయ్యింది. ఈ సారి హుండీ ఆదాయం రూ.11,44,12,707 వచ్చినట్లు అధికారులు ప్రకటించారు. అంతేకాకుండా, 631 గ్రాముల బంగారం, 48.350 కిలోల వెండిని భక్తులు అమ్మవార్లకు సమర్పించారు. ఇందులో చిల్లర నాణేల ద్వారా రూ.37 లక్షలు దేవాలయానికి సమకూరాయి. అయితే, 2020 జాతర ఆదాయంతో పోల్చితే కొంత తగ్గినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. హుండీ ఆదాయంలో 33శాతం పూజారులకు, 67 శాతం దేవాదాయ శాఖకు చెందుతుంది.
Next Story