- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Mastan Sai Case : మస్తాన్ సాయి హత్య కేసు.. గవర్నర్ కు కీలక లేఖ
రాజ్ తరుణ్ - లావణ్య(Raj Tarun - Lavanya) కేసు రోజుకో కీలక మలుపు తిరుగుతోంది.

దిశ, వెబ్ డెస్క్ : రాజ్ తరుణ్ - లావణ్య(Raj Tarun - Lavanya) కేసు రోజుకో కీలక మలుపు తిరుగుతోంది. ఈ కేసులో లావణ్య మస్తాన్ సాయి(Mastan Sai)పై తీవ్ర ఆరోపణలు చేస్తూ నార్సింగి పోలీసులకు కంప్లైంట్ కూడా ఇచ్చారు. కాగా పోలీసులు మస్తాన్ సాయిని అరెస్ట్ చేశారు. మస్తాన్ సాయి విచారణలో దొరికిన అనేక న్యూడ్ వీడియోలు, కాల్ రికార్డింగ్స్ ఉన్నట్టు సంచలన విషయాలు బయటకు రాగా.. తన జీవితం నాశనం అవడానికి కారణం మస్తాన్ సాయి అని, అతని మాటలు నమ్మి రాజ్ తరుణ్ తో తాను గొడవ పడ్డానని, తనను క్షమించాలని బహిరంగంగా రాజ్ తరుణ్ ను కోరారు లావణ్య. ఈ క్రమంలో మస్తాన్ సాయి కుటుంబంపై ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్(Letter to Governor Justice Abdul Nazeer) కు లావణ్య అడ్వొకేట్ ఓ కీలక లేఖ రాశారు. మస్తాన్ సాయి కుటుంబం గుంటూరులో మస్తాన్ దర్గా(Mastan Darga) ధర్మకర్తలుగా ఉన్నారని, ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్న వారికి ధర్మకర్తలుగా ఉండే అర్హత లేదని, తక్షణమే వారిని తొలగించాలని ఆ లేఖలో పేర్కొన్నారు. మస్తాన్ సాయి నేరాల వలన దర్గాకు ఉన్న పవిత్రత చెడిపోతుందని.. భగవంతునికి మచ్చ తెచ్చే వారిని దూరం పెట్టాలని తెలిపారు. గవర్నర్ కే కాకుండా ఏపీ సీఎస్, గుంటూరు కలెక్టర్ వంటి పలువురికి కూడా లేఖలు రాశారు లావణ్య న్యాయవాది.






