దంపతుల మధ్య తరుచుగా అలా జరుగుతుందని.. వివాహిత మృతి

by Web Desk |
దంపతుల మధ్య తరుచుగా అలా జరుగుతుందని.. వివాహిత మృతి
X

దిశ, నిర్మల్ కల్చరల్: తెల్లవారితే పండగ అనగా.. వారింట్లో విషాదం చోటు చేసుకుంది. నిర్మల్ పట్టణంలోని మంజులాపూర్ లో అర్గుల ప్రణీత (24) అనే వివాహిత మంగళవారం తెల్లవారుజామున అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. స్థానిక పోలీసులు, బంధువుల కథనం ప్రకారం.. కుంటాల మండలానికి చెందిన ప్రణీత మంజులాపూర్ కు చెందిన తన మేనబావ అర్గుల సాయికృష్ణ తో ఎనిమిది సంవత్సరాలక్రితం వివాహం జరిగింది. వీరికి ఆరు సంవత్సరాలలోపు వయసున్న ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారి సంసారంలో తరచుగా మనస్పర్థలతో గొడవలు జరుగుతున్నాయి.

ఈ క్రమంలో గత నాలుగునెలల క్రితం ఇరుపక్షాల పెద్ద మనుషుల సమక్షంలో సర్దిచెప్పి అత్తారింటికి పంపారు. అయితే మంగళవారం తెల్లవారుజామున అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. భర్త, అత్త కుటుంబసభ్యుల వేధింపులతోనే మృతి చెందిందని ఆరోపిస్తూ తగిన న్యాయం చేయాలని కోరుతూ మంగళవారం ప్రణీత సోదరుడు ప్రవీణ్ స్థానిక నిర్మల్ రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వినయ్ కుమార్ వివరించారు.


Next Story

Most Viewed