ఆ సదస్సుకు ఎంపికైన శాయంపేట వాసి..

by Web Desk |
ఆ సదస్సుకు ఎంపికైన శాయంపేట వాసి..
X

దిశ, శాయంపేట: ఏప్రిల్ నెల పుణేలో జరిగే అంతర్జాతీయ జీవ శాస్త్ర సదస్సుకి హన్మకొండ జిల్లా శాయంపేట వాసి మరపెల్లి మనోజ్ ఎంపికైనాడు. తెలంగాణ రాష్ట్రం నుంచి ఎంపికైన ఏకైక వ్యక్తి మనోజ్ అని ఎంపిక లైఫ్ సైన్స్ విభాగ కన్వీనర్ టీమ్ తెలిపింది. ఏప్రిల్ మాసంలో జరిగే ఈ సదస్సులో విద్యార్థులు మానసిక ఒత్తిడి, విద్య విధానం, గిరిజన, గ్రామాల్లో విద్యని పెంపొందించే వాటిపై సదస్సు ప్రారంభం కానుంది. గతంలో మరపెల్లీ మనోజ్ బెస్ట్ కౌన్సిల్ గా జాతీయ అవార్డు పొంది 2020లో AICT ఆల్ ఇండియా కౌన్సిలర్ ట్రైనర్ గా మూడో స్థానం దక్కింది. ఎన్నో సామాజిక కార్యక్రమాల్లో పాల్గొని 2019 సెంట్రల్ స్కాలర్ షిప్ తో ఓ గిరిజన బాలికను చదివించారు. ప్రస్తుతం మనోజ్ తెలుగు రాష్ట్రం నుండి ఎంపిక కావడం సంతోషిస్తూ పలువురు అధికారులు అభినందించారు.



Next Story