రజబలినగర్ విద్యార్థులకు నూతన పాఠ్య పుస్తకాలు అందజేసిన మండల విద్యాశాఖాధికారి

by Jakkula.Mamatha |

అన్నపురెడ్డిపల్లి మండలం పెద్దిరెడ్డి గూడెం గ్రామ పంచాయితీలోని గిరిజన ఆవాస ప్రాంతంలోని రజబలినగర్ పాఠశాల విద్యార్థులకు నూతన పాఠ్యపుస్తకాలను, నోటు పుస్తకాలు, పెన్సిళ్లు అందజేశారు.

రజబలినగర్ విద్యార్థులకు నూతన పాఠ్య పుస్తకాలు అందజేసిన మండల విద్యాశాఖాధికారి
X

దిశ, అన్నపురెడ్డిపల్లి: అన్నపురెడ్డిపల్లి మండలం పెద్దిరెడ్డి గూడెం గ్రామ పంచాయితీలోని గిరిజన ఆవాస ప్రాంతంలోని రజబలినగర్ పాఠశాల విద్యార్థులకు నూతన పాఠ్యపుస్తకాలను, నోటు పుస్తకాలు, పెన్సిళ్లు అందజేశారు. 2025-26 విద్యా సంవత్సరంలో 11 మంది ఇక్కడ విద్యను అభ్యసించారని ఈ సంవత్సరం ప్రస్తుతం 16 మంది ఉన్నారని, ఇంకా పెరిగే అవకాశం ఉందని మండల విద్యాశాఖాధికారి ఉండేటి ఆనంద కుమార్ తెలియజేశారు. అంతేగాక తాత్కాలిక తరగతి గదిని, వంట ఏర్పాట్లను పర్యవేక్షించారు. పిల్లలు బాగా చదువుకొని వృద్ధిలోకి రావాలని ఆకాంక్షించారు. ఈ పుస్తక పంపిణీ కార్యక్రమంలో గ్రామస్తులు మడకం మహేష్, మార్వి జోగా, పొడియం ఉంగా, పొడియం గంగా తదితరులు పాల్గొన్నారు.

Next Story