- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
India: భారత బాండ్ మార్కెట్లోకి భారీగా విదేశీ నిధులు
ఇప్పటివరకు సంక్లిష్టమైన పన్ను సమస్యలు, దేశీయంగా అకౌంటింగ్ రూల్స్ లాంటి నిర్వహణ కారణాల వల్ల దూరంగా ఉన్న విదేశీ పెట్టుబడిదారులు కూడా ఇప్పుడు భారత్ వైపు చూస్తున్నారని ట్రెజరీ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

దిశ, బిజినెస్ బ్యూరో: భారత ప్రభుత్వ బాండ్లలో విదేశీ పెట్టుబడులను ప్రోత్సహించేందుకు కేంద్రం తీసుకున్న చర్యలు మార్కెట్లో సానుకూల ప్రభావం చూపుతున్నాయి. ప్రభుత్వ సెక్యూరిటీలపై విదేశీ పెట్టుబడిదారులు చెల్లించాల్సిన పన్నులను రద్దు చేయడంతో పాటు, కొత్త దీర్ఘకాలిక బాండ్లను గ్లోబల్ ఇండెక్స్లకు అర్హత కలిగిన ‘ఫుల్లీ యాక్సెసిబుల్ రూట్’లో చేర్చింది. ఈ నిర్ణయాల తర్వాత విదేశీ ఫండ్లు గతవారం ఒక్క రోజులోనే రూ. 4,490 కోట్ల విలువైన భారత ప్రభుత్వ బాండ్లను కొనుగోలు చేశాయి. గత ఏడాది కాలంలో ఇదే అతిపెద్ద పెట్టుబడి ప్రవాహంగా మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటివరకు సంక్లిష్టమైన పన్ను సమస్యలు, దేశీయంగా అకౌంటింగ్ రూల్స్ లాంటి నిర్వహణ కారణాల వల్ల దూరంగా ఉన్న విదేశీ పెట్టుబడిదారులు కూడా ఇప్పుడు భారత్ వైపు చూస్తున్నారని ట్రెజరీ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇక విదేశీ నిధులు రావడంతో రూపాయికి కూడా ఊతం లభించింది. డాలర్తో పోలిస్తే రూపాయి ఒక్క రోజులో 0.9 శాతం బలపడింది. ఇదే సమయంలో పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, పెరుగుతున్న చమురు ధరలు, గ్లోబల్ మార్కెట్లలో రిస్క్ భయాలు ఆసియా దేశాల కరెన్సీలపై ఒత్తిడి పెంచుతున్నాయి. ఈ పరిస్థితుల్లో భారత్తో పాటు ఇతర దేశాలు కూడా తమ కరెన్సీలకు మద్దతుగా చర్యలు వేగవంతం చేస్తున్నాయి. మొత్తంగా చూస్తే, విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు తీసుకున్న తాజా నిర్ణయాలు భారత బాండ్ మార్కెట్కు కొత్త ఊపు ఇవ్వడమే కాకుండా, రూపాయి స్థిరత్వానికి కూడా తోడ్పడుతున్నాయి.






