Manchu Lakshmi: యాదాద్రిలో ప్రభుత్వ పాఠశాలను దత్తత తీసుకున్న మంచు లక్ష్మి

by Malleboina Mahesh |   (  Updated:2022-07-21 09:27:50  IST  )

Government School in Yadadri Is Adopted by Manchu Lakshmi| యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆలేరు మండలం పటేల్‌గూడెం ప్రభుత్వ పాఠశాలను దత్తత తీసుకొని అభివృద్ధి చేయనున్నట్లు ప్రముఖ నటుడు మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మి తెలిపారు

Government School in Yadadri Is Adopted by Manchu Lakshmi
X

దిశ, యాదాద్రి కలెక్టరేట్: Government School in Yadadri Is Adopted by Manchu Lakshmi| యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆలేరు మండలం పటేల్‌గూడెం ప్రభుత్వ పాఠశాలను దత్తత తీసుకొని అభివృద్ధి చేయనున్నట్లు ప్రముఖ నటుడు మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మి తెలిపారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ పమేలా సత్పతి, డీఈవో ఇతర అధికారులతో ఆమె సమావేశం అయ్యారు.

కేంద్ర ప్రభుత్వం యొక్క నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2022 తెలంగాణ ప్రభుత్వం మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని 50 ప్రభుత్వ పాఠశాలను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. కాగా మొదటగా పటేల్ గూడెం ప్రభుత్వ పాఠశాలను దత్తత తీసుకొని అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. దత్తత తీసుకున్న పాఠశాలల్లో మూడు సంవత్సరాల పాటు స్మార్ట్ క్లాస్ లు నిర్వహిస్తామని తెలిపారు.

ఇది కూడా చదవండి: నేనున్నా.. ఖమ్మంలో రౌడీషీటర్లకు 'ఆంజనేయ' అభయం..!!

Next Story