'మిస్‌ క్వీన్ ఆఫ్ ఇండియా 2022'గా వైష్ణవి శర్మ.. ప్రముఖుల అభినందనలు

by Malleboina Mahesh |

దిశ, సినిమా: ‘మణప్పురం అండ్ డీ క్యూ మిస్ క్వీన్ ఆఫ్ ఇండియా 2022’11వ ఎడిషన్ అందాల పోటీలు latest telugu news..

మిస్‌ క్వీన్ ఆఫ్ ఇండియా 2022గా వైష్ణవి శర్మ.. ప్రముఖుల అభినందనలు
X

దిశ, సినిమా: 'మణప్పురం అండ్ డీ క్యూ మిస్ క్వీన్ ఆఫ్ ఇండియా 2022'11వ ఎడిషన్ అందాల పోటీలు ఘనంగా జరిగాయి. ఆదివారం రాత్రి కోచి‌లోని 'సాజ్ ఎర్త్ రిసార్ట్స్ కన్వెన్షన్ సెంటర్'లో జరిగిన ఈ ఫైనల్ పోరులో 20 మంది అమ్మాయిలు అందంతో కట్టిపడేస్తూ హోరాహోరీగా తలపడ్డారు. అయితే ఇందుకు సంబంధించిన వివరాలను తాజాగా హైదరాబాద్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మణప్పురం, పెగాసస్ సంస్థల ప్రతినిధులు వెల్లడించారు.

ఈ మేరకు రాజస్థాన్‌కి చెందిన వైష్ణవి శర్మ 'మిస్ క్వీన్ ఆఫ్ ఇండియా 2022' అవార్డ్ టైటిల్ విన్నర్ కాగా.. మహారాష్ట్ర అమ్మాయి 'మెహరమీట్ కౌర్', తమిళనాడు‌కి చెందిన 'అభినయ‌కి' రన్నరప్‌ అవార్డును సొంతం చేసుకున్నారు. మొదటి విజేత వైష్ణవి శర్మను డాక్టర్ అజిత్ రవి, పెగాసస్ గ్లోబల్ ఎండి జిబితా అవార్డుతో సత్కరించగా.. మొదటి, రెండవ విజేతలను మణప్పురం 'ఎండి' అండ్ 'సి ఈ ఓ' వి. పి. నందకుమార్ అవార్డులు అందించి ఆల్ ది బెస్ట్ చెప్పారు.

Next Story