- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Huzurabad: రియల్ ఎస్టేట్ వెంచర్లో వ్యక్తి అనుమానాస్పద మృతి
హుజురాబాద్ పట్టణ శివారులో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మరణించడం స్థానికంగా కలకలం రేపింది.

దిశ,హుజురాబాద్ రూరల్: హుజురాబాద్ పట్టణ శివారులో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మరణించడం స్థానికంగా కలకలం రేపింది. నాగేంద్ర దాబా సమీపంలోని ఒక రియల్ ఎస్టేట్ వెంచర్లో ఈ ఘటన వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే.. హుజురాబాద్ మండలం పెద్దపాపయ్యపల్లి గ్రామానికి చెందిన గుడి తిరుపతిరెడ్డి (43) గత కొంతకాలంగా పట్టణంలోని ఓ వెంచర్లో షెడ్డు వేసుకుని ఒంటరిగా నివసిస్తున్నాడు. అతనికి భార్యాపిల్లలు లేకపోవడంతో బంధువులే అతని యోగక్షేమాలు చూసుకుంటున్నారు. ఈ క్రమంలో సోమవారం రాత్రి మృతుని బావ కుమారుడు శివారెడ్డి చూడ డానికి వెళ్లగా గది తలుపులు తెరిచి ఉన్నాయి. లోపలికి వెళ్లి చూడగా తిరుపతిరెడ్డి విగతజీవిగా పడి ఉన్నాడు.
తిరుపతిరెడ్డి మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతుడికి చెందిన 3 ఎకరాల భూమిని ఒక రాజకీయ నాయకుడు అక్రమంగా పట్టా చేయించుకుని మోసగించాడని ఆరోపిస్తున్నారు. ఆ భూమి విషయంలోనే ఈ మృతి సంభవించి ఉండవచ్చని బంధువులు ఆరోపిస్తున్నారు. గత కొద్దిరోజులుగా భూమి విషయమై తిరుపతిరెడ్డి తీవ్ర మనస్తాపానికి గురయ్యాడని వారు పేర్కొంటున్నారు. పోలీసులు ఈ ఘటనపై సమాచారం అందుకుని దర్యాప్తు ప్రారంభించాల్సి ఉంది. పోస్టుమార్టం నివేదిక వస్తేనే ఇది ఆత్మహత్యా లేక హత్య అనే కోణంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.






