పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్న మతిస్థిమితం లేని వ్యక్తి

by Dishanational1 |
పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్న మతిస్థిమితం లేని వ్యక్తి
X

దిశ, కోదాడ: మతిస్థిమితం లేని వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన శనివారం చోటు చేసుకుంది. పట్టణ సిఐ నరసింహారావు తెలిపిన వివరాల ప్రకారం.. కోదాడ మండల ద్వారకుంట గ్రామానికి చెందిన అర్వపల్లి నాగేశ్వర్ రావు అనే వ్యక్తి గత మూడు నెలల నుండి మానసికస్థితి సరిగా ఉండక మానసికంగా బాధపడుతూ మందులు వాడుతున్నాడు. అదేవిధంగా ఆర్ధిక అసమానతల వల్ల ఈ నెల 8న ఇంట్లోవారికి చెప్పకుండా వెళ్లిపోయాడు. కుటుంబ సభ్యులు అతడి ఆచూకీ కోసం అప్పటి నుంచి వెతుకుతున్నారు. కాగా, శనివారం కోదాడ పట్టణ శివారు శ్రీరంగాపురం సమీపంలోని జాతీయ రహదారి వెంబడి ఉన్న పొలం వద్ద మృతదేహలం ఉన్నట్లు సమాచారం రావడంతో పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. అనంతరం మృతుడు అర్వపల్లి నాగేశ్వర్ రావుగా గుర్తించారు. మృతునికి ముగ్గురు కుమారులు, భార్య ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.



Next Story

Most Viewed