నడుచుకుంటూ వెళుతున్న వ్యక్తి హఠాన్మరణం

by Dishanational1 |
నడుచుకుంటూ వెళుతున్న వ్యక్తి హఠాన్మరణం
X

దిశ, బేగంపేట: నడుచుకుంటూ వెళుతున్న గుర్తుతెలియని వ్యక్తి కిందపడిపోయి హఠాన్మరణానికి గురయ్యాడు. ఈ ఘటన మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై సైదులు తెలిపిన వివరాల ప్రకారం శనివారం ఉదయం సెయింట్ మేరీస్ రోడ్ లోని యాత్రి ఇన్ హోటల్ ముందు గుర్తుతెలియని వ్యక్తి నడుచుకుంటూ వెళుతూ హఠాత్తుగా కిందపడిపోయాడు. వెంటనే ఆ హోటల్లో రిసిప్షనిస్టుగా పనిచేసే దుర్గం తిరుపతి వెళ్లి ఆయనను పరిశీలించగా అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. వెంటనే 108కు సమాచారం ఇవ్వడంతో సిబ్బంది వచ్చి పరీక్షించి అప్పటికే చనిపోయినట్లు చెప్పారు. మార్కెట్ పోలీసులు వచ్చి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతుడి ఒంటిపై నీలం తెలుపు రంగు చొక్కా, ఆకుపచ్చ రంగు, నీలం రంగు చారల లుంగీ ధరించి ఉన్నాడని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని గుర్తింపు నిమిత్తం గాంధీ మార్చురీలో భద్రపరిచారు. సంబంధికులు ఉంటే మార్కెట్ పోలీస్ స్టేషన్ నంబర్ 040-27853598 , 8978037820 ఫోన్ నంబర్లకు సమాచారం ఇవ్వాలని తెలిపారు.



Next Story

Most Viewed