విషాదం.. పాల కోసం వచ్చి పరాలోకానికి వెళ్లాడు

by Dishanational2 |
విషాదం.. పాల కోసం వచ్చి పరాలోకానికి వెళ్లాడు
X

దిశ,పాలకుర్తి : పాలకొచ్చిన వచ్చిన వ్వక్తి లారీ ఢీకొని పరలోకాలనికి వెళ్లిన ఘటన పాలకుర్తి నియోజకవర్గ కేంద్రం రాజీవ్ చౌరస్తాలో ఆదివారం తెల్లవారు జామున జరిగింది. జనగామ జిల్లా పాలకుర్తి మండలం బమ్మెరగ్రామానికి చెందిన చింతల వెంకటరామ నర్సయ్య(74) పాలపాకెట్ తీసుకొని చౌరస్తా నుంచి సైకిల్ పై విస్నూర్ వైపు ఉన్నతన ఇంటికి వెళ్తున్నాడు. జనగామ నుంచి వస్తున్నలారీ డ్రైవర్ నిద్ర మత్తులో రామనర్సయ్య ఢీ కొట్టడంతో తీవ్ర గాయాలు అయ్యాయి. రామనర్సయ్యను హుటాహుటిన 108లో జనగామ ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు. మృతిచెందిన రామనర్సయ్యకు భార్య ఉంది.

Next Story

Most Viewed