భవనంపై నుండి పడి వ్యక్తి మృతి

by Dishafeatures2 |
భవనంపై నుండి పడి వ్యక్తి మృతి
X

దిశ, కొల్చారం : కొల్చారం మండలం అప్పాజీ పల్లి గ్రామంలో శుక్రవారం ఉదయం నూతనంగా నిర్మిస్తున్న ఇంటికి పైపుతో నీళ్ళు పడుతుండగా ప్రమాదవశాత్తు కింద పడ్డ వ్యక్తి మెదక్ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. గ్రామానికి చెందిన మృతుడు కన్నెబోయిన సత్తయ్య(52) గ్రామంలో నూతనంగా ఇంటిని నిర్మిస్తున్నాడు. ఉదయం ఇంటి గోడలకు నీటిని పడుతున్న క్రమంలో ప్రమాదవశాత్తు కాలుజారి భవనం పై నుండి కింద పడ్డాడు. ప్రమాదంలో సత్తయ్య తలకు, కాళ్లు చేతులకు తీవ్ర గాయాలు కావడంతో మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. మృతుని భార్య స్వరూప ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.


Next Story