పుట్టింటికి వెళ్లిన భార్య.. ఇంట్లో ఎవరు లేని సమయం చూసి భర్త..

by Disha Web Desk 19 |
పుట్టింటికి వెళ్లిన భార్య.. ఇంట్లో ఎవరు లేని సమయం చూసి భర్త..
X

దిశ, ఇందల్వాయి: ఇందల్వాయి మండలంలోని ఎల్లారెడ్డి పల్లి గ్రామంలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన బుష్కం శ్రీనివాస్(35) గత కొంత కాలంగా లింగాపూర్ క్రషర్ మిషన్‌లో పని చేస్తున్నాడు. అయితే, భార్యభర్తల మధ్య గొడవ జరగడంతో ఆమె ఫిబ్రవరిలో పుట్టింటికి వెళ్లింది. దీంతో మనస్తాపం చెందిన శ్రీనివాస్ ఆదివారం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకుని హత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నరేష్ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా, మృతునికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.



Next Story

Most Viewed