ఒకే బైక్‌పై వెళ్తున్న ఏడుగురు.. పోలీసులు ఆపి ఇదేంటని అడిగితే దిమ్మ తిరిగే ఆన్సర్ ఇచ్చాడు

by Dishanational1 |
ఒకే బైక్‌పై వెళ్తున్న ఏడుగురు.. పోలీసులు ఆపి ఇదేంటని అడిగితే దిమ్మ తిరిగే ఆన్సర్ ఇచ్చాడు
X

దిశ, వెబ్ డెస్క్: బైక్ పై అతనితో కలిపి మొత్తం ఏడుగురు వెళ్తున్నారు. దీంతో అతడిని పోలీసులు ఆపి ఇదేంటి ఇంతమందిని తీసుకెళ్తున్నావని అడిగారు. వెంటనే అతను చెప్పిన సమాధానం విని పోలీసులు షాకయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే.. సోషల్ మీడియాలో ఓ వీడియో భారీగా వైరల్ అవుతోంది. బీహార్ రాష్ట్రంలోని షియోహర్ జిల్లా నవాబ్ హైస్కూల్ వద్ద పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ బైక్ ను చూసి పోలీసులు షాకయ్యారు. వెంటనే ఆ బైక్ ను ఆపి.. ఇదేంటి ఒక్క బైక్ పై ఏడుగురు వెళ్తారా అని ప్రశ్నించారు. వెంటనే ఆ వ్యక్తి స్పందిస్తూ.. ' పెట్రోల్ రేట్ బాగా ఉంది. మూన్నాలుగు రౌండ్లు వేస్తే పెట్రోల్ కు భారీగా డబ్బులవుతాయి సార్.. అందుకే అందరినీ ఒకేసారి తీసుకెళ్తున్నాను' అని చెప్పాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోను చూసిన నెటిజన్స్ పెట్రోల్ రేట్లపై ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు.

Next Story

Most Viewed