- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇసుక అక్రమ రవాణా చేస్తూ ప్రమాదానికి కారణమైన వ్యక్తి అరెస్ట్
మండల పరిధిలోని పందిళ్లపల్లి గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున చింతకాని గ్రామానికి చెందిన మాతంగి నాగరాజు, అతని స్నేహితుడు లింగాల మహేందర్ ఖమ్మంలోని ఆసుపత్రిలో ఉన్న తమ స్నేహితుడిని పరామర్శించాడని వెళ్లారు.

దిశ, చింతకాని: మండల పరిధిలోని పందిళ్లపల్లి గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున చింతకాని గ్రామానికి చెందిన మాతంగి నాగరాజు, అతని స్నేహితుడు లింగాల మహేందర్ ఖమ్మంలోని ఆసుపత్రిలో ఉన్న తమ స్నేహితుడిని పరామర్శించాడని వెళ్లారు. అనతంరం తిరిగి బైక్పై చింతకానికి వస్తుండగా, ఉదయం సుమారు 4:00 గంటల సమయంలో పందిళ్లపల్లి సబ్స్టేషన్ సమీపంలో బోనకల్ నుండి ఖమ్మం వైపు వస్తున్న ఇసుక టిప్పర్ను డ్రైవర్ అతివేగంగా, నిర్లక్ష్యంగా నడుపుతూ ఎదురుగా వస్తున్న వారి బైక్ను ఢీకొట్టాడు.
ఈ ప్రమాదంలో మాతంగి నాగరాజు తీవ్ర గాయాల కారణంగా సంఘటనా స్థలంలోనే మృతి చెందగా, లింగాల మహేందర్ తీవ్ర గాయాలపాలయ్యారు. ప్రమాదం అనంతరం టిప్పర్ డ్రైవర్ వాహనాన్ని అక్కడే వదిలేసి పరారయ్యాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా, టిప్పర్ డ్రైవర్ తోట వెంకటేశ్వర్లు(32) వృత్తి డ్రైవర్, నివాసం కంచికచర్ల, ఎన్టీఆర్ జిల్లా పోలీసుల ఎదుట లొంగిపోయాడు. అతనిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్ఐ వీరేందర్ తెలిపారు.






