- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నాంపల్లిలో మెగా జాబ్ మేళా.. ప్రారంభించనున్న మంత్రి అజారుద్దీన్
by Naga Rani Yarlagadda |
నిరుద్యోగ మైనారిటీ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో.. జూన్ 9న నాంపల్లిలోని రెడ్ రోజ్ ప్యాలెస్లో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు తెలంగాణ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ప్రకటించింది.

X
దిశ, తెలంగాణ బ్యూరో : నిరుద్యోగ మైనారిటీ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో.. జూన్ 9న నాంపల్లిలోని రెడ్ రోజ్ ప్యాలెస్లో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు తెలంగాణ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ప్రకటించింది. ఈ జాబ్ మేళాను మైనారిటీస్ వెల్ఫేర్ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ ప్రారంభించనున్నారు. ఈ జాబ్ మేళాలో ఐటీ, బ్యాంకింగ్, ఫైనాన్స్, హెల్త్కేర్, మాన్యుఫాక్చరింగ్, లాజిస్టిక్స్, హాస్పిటాలిటీ, కస్టమర్ సర్వీసెస్ తదితర రంగాలకు చెందిన 40 నుంచి 50 సంస్థలు పాల్గొననున్నాయి. అర్హత కలిగిన మైనారిటీ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మైనారిటీ సంక్షేమ శాఖ అధికారులు సూచించారు.
Next Story






