పాకిస్థాన్ గడ్డపై హీరో సీక్రెట్ ఆపరేషన్.. జూన్​10న రిజల్ట్

by Disha Web Desk 17 |
పాకిస్థాన్ గడ్డపై హీరో సీక్రెట్ ఆపరేషన్.. జూన్​10న రిజల్ట్
X

దిశ, సినిమా: సిద్ధార్థ్ మల్హోత్రా, రష్మిక మందన్న కాంబోలో వస్తున్న యాక్షన్ థ్రిల్లర్ 'మిషన్ మజ్ను'. రష్మికకు హిందీలో ఇదే తొలి చిత్రం కాగా తాజాగా సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్. బాగ్చి శాంతను దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మే 13న విడుదల చేయాల్సి ఉండగా.. కొన్ని కారణాల వల్ల పోస్ట్‌పోన్ చేస్తూ 2022 జూన్​10న రిలీజ్ చేస్తున్నట్లు అధికారిక ప్రకటన చేశారు. ఈ మేరకు 'లక్ష్యం సెట్ చేయబడింది. పాకిస్తాన్ నడిబొడ్డున భారతదేశం నిర్వహించే అత్యంత సాహసోపేతమైన RAW మిషన్‌లో భాగం కావడానికి సిద్ధంగా ఉండండి' అంటూ సోషల్ మీడియా వేదికగా అభిమానులను అలర్ట్ చేశారు మేకర్స్. ఇక 1970ల నాటి వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కించిన ఈ చిత్రంలో RAW ఏజెంట్‌ లీడర్‌గా సిద్ధార్థ్ కనిపించనున్నాడు.



Next Story

Most Viewed