Maharashtra: పెట్రోల్, డీజిల్ ధర తగ్గించిన రాష్ట్ర ప్రభుత్వం

by Disha Web Desk 12 |
Maharashtra CM Eknath Shinde Slashes Petrol and Diesel Prices
X

దిశ, వెబ్‌డెస్క్: Maharashtra CM Eknath Shinde Slashes Petrol and Diesel Prices| మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం అనంతరం వివిధ నాటకీయ పరినణామాల అనంతరం శిశసేన రెబల్ ఎమ్మెల్యే ఏక్‌నాథ్ షిండే మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. సీఎం పదవిలోకి రాగానే పవర్ చార్జీలు పెంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న షిండే.. వాటిని అధిగమించడానికి రాష్ట్రం వసూల్ చేస్తున్న పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించారు. షిండే ప్రభుత్వం లీటరు పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ. 3 తగ్గించారు. మహారాష్ట్ర ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు తమ ప్రభుత్వం ఇంధనంపై వ్యాట్‌ను తగ్గిస్తామని ముఖ్యమంత్రి చెప్పిన కొద్దిరోజుల తర్వాత ఈ నిర్ణయాన్ని షిండే ప్రభుత్వం తీసుకుంది.

Also Read: ఆ భాష నేర్చుకోవాలని ఫిక్స్ అయిన ముఖ్యమంత్రి

Next Story