- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆంధ్ర టూ ఛత్తీస్గఢ్కు అక్రమంగా రేషన్ బియ్యం తరలింపు.. లారీ సీజ్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల కేంద్రంలో భారీగా తరలుతున్న రేషన్ బియ్యాన్ని(పీడీఎస్) పోలీసులు పట్టుకున్నారు.

దిశ, బూర్గంపాడు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల కేంద్రంలో భారీగా తరలుతున్న రేషన్ బియ్యాన్ని(పీడీఎస్) పోలీసులు పట్టుకున్నారు. ఏపీ నుంచి ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి అక్రమంగా తరలిస్తున్న సుమారు 28 నుంచి 30 టన్నుల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం మండల కేంద్రంలో బూర్గంపాడు ఎస్సై మేడ ప్రసాద్ తన సిబ్బందితో కలిసి సాధారణ వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో అటుగా వెళ్తున్న ఒక లారీ పై అనుమానం రావడంతో దాన్ని ఆపి తనిఖీ చేశారు. లారీ పైకి ఎక్కి పరిశీలించగా, అందులో పెద్ద ఎత్తున పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్(పీడీఎస్)కు చెందిన రేషన్ బియ్యం బస్తాలు ఉన్నట్లు గుర్తించారు.
లారీలో ఎలాంటి అనుమతులు లేకుండా తరలిస్తున్న సుమారు 28 నుంచి 30 టన్నుల బియ్యాన్ని స్వాధీనం చేసుకుని, లారీని బూర్గంపాడు పోలీస్ స్టేషన్కు తరలించారు. ప్రాథమిక విచారణలో భాగంగా లారీ డ్రైవర్ను ప్రశ్నించగా.. ఈ బియ్యాన్ని ఆంధ్రప్రదేశ్ నుంచి ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి అక్రమంగా తరలిస్తున్నట్లు అంగీకరించాడు. ఈ ఘటనపై బూర్గంపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ అక్రమ రవాణా వెనుక ఎవరెవరి హస్తం ఉందనే కోణంలో పోలీసులు పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.






