మాజీ ఎమ్మెల్యే వంగ సుబ్బారావు మృతికి నేతల సంతాపం

by Batti.Sumithra |

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇల్లందు నియోజకవర్గానికి శాసనసభ్యులుగా తనవంతు ప్రజాసేవ చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం వీఎం బంజారా గ్రామానికి చెందిన మాజీ శాసనసభ్యులు వంగ సుబ్బారావు శనివారం కన్నుమూశారు.

మాజీ ఎమ్మెల్యే వంగ సుబ్బారావు మృతికి నేతల సంతాపం
X

దిశ, పెనుబల్లి : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇల్లందు నియోజకవర్గానికి శాసనసభ్యులుగా తనవంతు ప్రజాసేవ చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం వీఎం బంజారా గ్రామానికి చెందిన మాజీ శాసనసభ్యులు వంగ సుబ్బారావు శనివారం కన్నుమూశారు. విషయం తెలుసుకున్న సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య వంగ సుబ్బారావు భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించి, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కనగాల వెంకట్రావు, మందాడపు అశోక్, షేక్ గౌస్, వంగ చిన్నపండు, బాబురావు, కొత్తపల్లి సుధాకర్, రవి, చంటి మరకాల తదితరులు పాల్గొన్నారు.

Next Story