హైదరాబాద్ ప్రయాణికులకు శుభవార్త.. త్రీ స్టాప్ సర్వీస్ ప్రారంభం

by Dishanational2 |
హైదరాబాద్ ప్రయాణికులకు శుభవార్త.. త్రీ స్టాప్ సర్వీస్ ప్రారంభం
X

జహీరాబాద్ , మార్చి: హైదరాబాద్ వెళ్లే ప్రయాణికులకు డిపో మేనేజర్‌కు శుభవార్త తెలిపారు. జహీరాబాద్ డిపోలో త్రీ స్టాప్ సర్వీస్‌లను ప్రారంభించినట్లు పేర్కొన్నారు. డిపో మేనేజర్ ఎన్ .రమేష్ గురువారం లాంఛనంగా ఈ సర్వేసులను ప్రారంభించారు. అంతర్రాష్ట్ర బస్సులకు ధీటుగా ప్రయాణికులకు అందుబాటులో ఈ సర్వీసులు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఎవరైనా తొందరగా హైదరాబాద్ వెళ్ళాలనుకునే వారు ఈ త్రీ స్టాప్ బస్సులలో తక్కువ ఖర్చులో గమ్యం చేరవచ్చన్నారు. కర్ణాటక రాష్ట్ర బస్సుల కంటే తక్కువ ఖర్చుతో ఈ బస్సులో మీరు నిర్ణీత సమయంలో హైదరాబాద్ కు చేరుకోవచ్చన్నారు. ఈ సర్వీసులు కేవలం మూడు స్టాప్‌లలో మాత్రమే అంటే సదాశివపేట, సంగారెడ్డి , లింగంపల్లి స్టాప్‌ల్లో మాత్రమే ఆగుతుందని డిపో మేనేజర్ తెలిపారు. ప్రయాణికుల డిమాండ్ మేరకు మునుముందు మరిన్ని సర్వీసులు పెంచనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో డిపో సహాయ మేనేజర్ శ్రీనివాస్, డిపో సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కుటుంబ సభ్యులతో బస్టాండ్‌కు వచ్చిన ఓ చిన్నారి చేత త్రీ స్టాప్ సర్వీస్ ప్రారంభోత్సవంచేసి ప్రయాణికులను బస్సులోకి అనుమతించా‌రు. ప్రయాణికులు ఈ సర్వీసులను సద్వినియోగం చేసుకుని డిపో అభివృద్ధికి సహకరించాలని విన్నవించారు.


Next Story