ఇలానే చేస్తే కాంగ్రెస్‌కు 2023 ఎన్నికలే చివరివి: దిగ్విజయ్ సింగ్

by Web Desk |
ఇలానే చేస్తే కాంగ్రెస్‌కు 2023 ఎన్నికలే చివరివి: దిగ్విజయ్ సింగ్
X

భోపాల్: కాంగ్రెస్ ఎంపీ, సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మధ్యప్రదేశ్ పార్టీ కార్యకర్తలు ఐకమత్యంగా పని చేయాలని లేని పక్షంలో 2023 ఎన్నికలే చివరివి అవుతాయని అన్నారు. పార్టీతో పాటు వ్యక్తిగత ఇబ్బందులు కూడా ఎదుర్కొంటారని అన్నారు. పార్టీ కార్యకర్తలతో దిగ్విజయ్ సింగ్ మాట్లాడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 'మీరు ఒకరినొకరు సరిగ్గా కలుసుకోవడం లేదు.

కొందరు వస్తున్నారు. మరి కొందరు రావట్లేదు. ఏ ఒక్కరూ మాట్లాడట్లేదు. ఇలా అయితే కాంగ్రెస్ ఎలా పోరాడుతుంది. దేశంలో ఇదే చివరి ఎన్నికలు. మీరు మీ మధ్య పోరును పరిష్కరించుకుని, ఐక్యంగా లేకుంటే కాంగ్రెస్ తిరిగి పుంజుకోలేదు. మీరంతా ఇంటి వద్దనే కూర్చుంటారు' అని కార్యకర్తలను హెచ్చరించారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉండడంతో మధ్యప్రదేశ్‌లో పార్టీ సవాళ్లను ఎదుర్కొంటుంది.

Next Story