- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- క్రైం
- సినిమా
- కెరీర్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- టెక్నాలజీ
- స్పోర్ట్స్
- సాహిత్యం
- జిల్లా వార్తలు
- భక్తి
- ఫోటోలు
- వీడియోలు
- ఆరోగ్యం
- రాశిఫలాలు
సరికొత్త మైలురాయిని చేరుకున్న లంబొర్ఘిని!

ముంబై: ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ కంపెనీ లంబొర్ఘిని భారత మార్కెట్లో మొదటిసారిగా 400 యూనిట్ల అమ్మకాల మార్కును అధిగమించినట్టు సోమవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. కంపెనీ దేశీయ మార్కెట్లో తొలిసారిగా 2007లో స్థానిక కార్యకలాపాలను ప్రారంభించింది. గత పదిహేనేళ్ల కాలంలో వినియోగదారుల నుంచి గణనీయమైన స్పందన రావడంతో కీలక మైలురాయిని సాధించగలిగామని లంబొర్ఘిని ఇండియా హెడ్ శరద్ అగర్వాల్ తెలిపారు. భారత్లో లంబొర్ఘిని బ్రాండ్ ద్వారా వినియోగదారులకు ప్రత్యేక ప్లాట్ఫామ్ల ద్వారా మెరుగైన సేవలందిస్తున్నామని కంపెనీ పేర్కొంది. కాగా, దేశీయ ఆటో పరిశ్రమలో లంబొర్ఘిని బ్రాండ్ గణనీయమైన వృద్ధికి అవకాశం ఉందని ఇటీవలే కంపెనీ ఓ ప్రకటనలో వెల్లడించింది. భారత్లో అత్యంత సంపన్న వర్గాల నుంచి పెరుగుతున్న డిమాండ్ కారణంగా ఈ వృద్ధి సాధించగలమని, అలాగే, ఇటీవల పెరుగుతున్న ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ)కు ప్రాధాన్యత నేపథ్యంలో కంపెనీ హైబ్రిడ్ వాహనాలను మార్కెట్లోకి ప్రవేశపెట్టే ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్టు వెల్లడించింది.
కంటెంట్ రైటర్లు కావాలి!
సంచలన కథనాలతో తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న దిశ వెబ్సైట్లో పని చేయడానికి సీనియర్, జూనియర్ కంటెంట్ రైటర్లు కావాలి.
పొలిటికల్, వైరల్, సినిమా, బిజినెస్, లైఫ్స్టైల్ కంటెంట్ రాసే వారికి ప్రాధాన్యం ఉంటుంది. ప్రతిభను బట్టి వేతనం ఉంటుంది.
ఆసక్తి ఉన్నవాళ్లు నెంబరు 79958 66670 కు తమ బయోడేటా వాట్సాప్ చేయండి. లేదా
వాకిన్ ఇంటర్వ్యూ కోసం కింది అడ్రస్లో సంప్రదించగలరు.
దిశ, ఫస్ట్ ఫ్లోర్, లుంబిని రాక్డేల్ ఈనాడు ఆఫీసు వెనకాల సోమాజీగూడ, హైదరాబాద్.